ఏపీలో సమ్మె బాటపట్టిన ఆడిట్ ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆడిట్ ఉద్యోగులు షాకిచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ వారు ప్రభుత్వానికి గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్టేట్ ఆడిట్ డైరెక్టర్ను కలిసిన ఉద్యోగులు నోటీసును అందజేశారు .
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆడిట్ ఉద్యోగులు షాకిచ్చారు. సమస్యల పరిష్కారం కోరుతూ వారు ప్రభుత్వానికి గురువారం సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ మేరకు స్టేట్ ఆడిట్ డైరెక్టర్ను కలిసిన ఉద్యోగులు నోటీసును అందజేశారు . ఆడిట్ ఉద్యోగుల్లో కేటగిరిల వారీగా గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని వారు కోరారు. జిల్లాల విభజనకు ముందున్న విధంగా డివిజన్ ఆఫీసులు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పాత విధానంలోనే వర్క్ అలాట్మెంట్ వుండాలని వారు కోరుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.