Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. గ్రూప్‌-1 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ..

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్-1 కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

APPSC Release Notification GRoup 1 Posts
Author
First Published Oct 1, 2022, 10:05 AM IST

ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో గ్రూప్-1 కేడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 92 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. అలాగే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులను కూడా భర్తీ చేయడానికి కూడా ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. 

గ్రూప్-1 పోస్టుల భర్తీ.. 
గ్రూప్ -1 పోస్టుల భర్తీ ప్రక్రియలో రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూల విధానాన్ని ప్రభుత్వం పునరుద్దరించింది. ఈ పోస్టులకు ఈ నెల 13 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను డిసెంబర్ 18, 2022న(తాత్కాలి తేదీ) నిర్వహించనున్నట్లు పేర్కొంది. గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు మర్చి 15, 2023 తర్వాత నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. 

అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీ..
మొత్తం 17 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌ల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈ నవంబర్ 2 నుంచి నవంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాలను https://psc.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని అధికారులు పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios