ఆంధ్రప్రదేశ్ పోలీసులను తమిళనాడు ప్రజలు చితకబాదారు. కరడుగట్టిన దొంగను పట్టుకోవడానికి నిన్న ఏపీ పోలీసుల బృందం వేలూరు జిల్లా మేలకుప్పంలో వెళ్లింది.
ఆంధ్రప్రదేశ్ పోలీసులను తమిళనాడు ప్రజలు చితకబాదారు. కరడుగట్టిన దొంగను పట్టుకోవడానికి నిన్న ఏపీ పోలీసుల బృందం వేలూరు జిల్లా మేలకుప్పంలో వెళ్లింది. అయితే స్థానికుల నుంచి పోలీసులకు ప్రతిఘటన ఎదురైంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఈ క్రమంలో వారిని చుట్టుముట్టిన స్థానికులు మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. అనంతరం రత్నగిరి పోలీస్ స్టేషన్లో అప్పగించారు. స్థానికుల దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. గతంలో ఎర్రచందనం స్మగర్లను పట్టుకోవడానికి వెళ్లిన ఏపీ పోలీసులపై స్థానికులు దాడికి ప్రయత్నించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
