Asianet News TeluguAsianet News Telugu

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు తప్పిన ప్రమాదం: ఎంపీ వ్యక్తిగత సిబ్బందికి గాయాలు

అన్నమయ్య  జిల్లాలోని  రాయచోటి  మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్ పై  జరిగిన  రోడ్డుప్రమాదంలో  మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు  తృటిలో తప్పించుకున్నారు.

AP Minister Peddireddy Ramachandra Reddy and MP Mithun Reddy Safely escaped From road accident in Annamayya District
Author
First Published Jan 16, 2023, 2:28 PM IST

చిత్తూరు: అన్నమయ్య  జిల్లాలోని  రాయచోటి మండలం చెన్నముక్కపల్లె  రింగ్ రోడ్  పై  సోమవారం నాడు  జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఏపీ మంత్రి  పెద్దిరెడ్డి  రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ  మిథున్ రెడ్డిలు తృటిలో  ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఎంపీ మిథున్ రెడ్డి వ్యక్తిగత  సిబ్బంది గాయపడ్డారు.

మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్ రెడ్డిలు  ఒకే కారులో  బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.   మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కాన్వాయ్ లోని  వాహనాన్ని  ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మంత్రి కాన్వాయ్ లోని కారు  పల్టీలు కొట్టింది. కారులో ఉన్న  మిథున్  రెడ్డి  వ్యక్తిగత కార్యదర్శి,  భద్రత సిబ్బందికి గాయాలయ్యాయి.  వీరిని చికిత్స నిమిత్తం  రాయచోటి  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.   ఈ ప్రమాదంలో  మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఎంపీ మిథున్ రెడ్డిలు  ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios