Asianet News TeluguAsianet News Telugu

ఎస్పీ వస్తున్నారు.... తప్పుకోండి: డీఎస్పీ పై మంత్రి జోగి రమేష్ ఫైర్


డీఎస్పీ వ్యవహరించిన తీరుపై  ఏపీ మంత్రి జోగి రమేష్  సీరియస్ అయ్యారు.  ఎస్పీ వస్తున్నారని  మంత్రిని  తప్పుకోవాలని  డీఎస్పీ   కోరడంపై  మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు.  
 

AP Minister  Jogi  Ramesh  Serious Comments  On DSP  lns
Author
First Published Apr 28, 2023, 1:15 PM IST

విజయవాడ:  కృష్ణా జిల్లాలో  డీఎస్పీ తీరుపై  ఏపీ మంత్రి  జోగి రమేష్  సీరియస్ అయ్యారు.  శుక్రవారంనాడు మైలవరంలో ఈ ఘటన  చోటు  చేసుకుంది.మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో  అబివృద్ది  కార్యక్రమాల  సమీక్ష కార్యక్రమానికి  ఏపీ పర్యాటక శాఖ మంత్రి  ఆర్ కే రోజా  ఇవాళ  వచ్చారు. మంత్రి రోజాకు  రోడ్లు, భవనాల శాఖ గెస్ట్ హౌస్ వద్ద  మంత్రి జోగి రమేష్ , పలువురు అధికారులు   స్వాగతం పలికేందుకు  చేరుకన్నారు.  మంత్రి  రోజాకు  బోకేలు  ఇచ్చి స్వాగతం చెబుతున్నారు. అయితే  అదే సమయంలో ఎస్పీ వస్తున్నారని  మంత్రి జోగి రమేష్ ను పక్కకు తప్పుకోవాలని  డీఎస్పీ  కోరారు.  ఈ విషయమై  మంత్రి జోగి రమేష్  డీఎస్పీపై  సీరియస్ అయ్యారు.   డీఎస్పీ తీరును జోగి రమేష్ తప్పు బట్టారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios