Asianet News TeluguAsianet News Telugu

గోవాలో జగ్గయ్యపేట వైద్యురాలి మృతి

గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.
 

AP lady doctor Ramya dies while taking selfie in Goa beach
Author
Jaggayyapet, First Published May 16, 2019, 2:57 PM IST

జగ్గయ్యపేట: గోవాలో సెల్ఫీ తీసుకొంటుండగా అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోయిన డాక్టర్ రమ్యకృష్ణ మృతి చెందింది. రమ్యకృష్ణ స్వగ్రామం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట. మూడేళ్లుగా గోవాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె వైద్యురాలిగా పని చేస్తోంది.

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని మార్కండేయ నగర్‌కు చెందిన రమ్యకృష్ణ ఎంబీబీఎస్ పూర్తి చేసింది. కొంత కాలం జగ్గయ్యపేట పీహెచ్‌సీలో పనిచేసింది. ఆ తర్వాత మూడేళ్లుగా గోవాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది. రమ్యకృష్ణ తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. 

మంగళవారం నాడు స్నేహితులతో కలిసి బీచ్‌కు వెళ్లింది.  బీచ్‌లో సెల్ఫీ తీసుకొంటున్న సమయంలో అలలు ఒక్కసారిగా ఆమెను సముద్రంలోకి లాక్కెళ్లాయి. రమ్యకృష్ణతో పాటు ఆమె స్నేహితురాలు కూడ సముద్రంలో కొట్టుకుపోయారు. రమ్యకృష్ణ స్నేహితురాలిని స్థానికులు కాపాడారు. రమ్యకృష్ణను మాత్రం కాపాడలేకపోయారు. ఈ విషయం తెలిసిన కుటుంబసబ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios