అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్: దమ్మాలపాటి కేసులో హైకోర్టు స్టే
అమరావతి రాజధాని ఏర్పాటు నేపథ్యంలో జరిగిన భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి రాజధాని ఏర్పాటు నేపథ్యంలో జరిగిన భూముల కుంభకోణానికి సంబంధించి మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో తదుపరి చర్యలు నిలిపివేయాలని ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎఫ్ఐఆర్లోని సమాచారాన్ని ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. దమ్మాలపాటి తరపున ముకుల్ రోహత్గి, శ్యాందివాన్ వాదనలు వినిపించారు. దమ్మాలపాటిని ఇరికించేందుకు ఉద్దేశ్యపూర్వకంగానే అభియోగాలు మోపారని ఆధారాలతో సహా హైకోర్టుకు అందజేశారు పిటిషనర్ తరపు న్యాయవాదులు.