సినిమా టికెట్ ధరలపై జీవో 35.. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో 35పై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది
సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 35పై శనివారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా జీవో 35పై 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. నిర్మాత నట్టికుమార్ దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించి న్యాయస్థానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35ను కొందరు యాజమాన్యాలు అమలు చేయడం లేదని నట్టికుమార్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అధికా రేట్లకు బ్లాక్లో టికెట్లు అమ్ముతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని ఆయన కోర్టుకు తెలియజేశారు.