Asianet News TeluguAsianet News Telugu

ఇసుక అక్రమాల కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఇసుక అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 22 కు వాయిదా వేసింది . ఈ కేసులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. ఏ 1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ 4గా దేవినేని ఉమా వున్నారు. 

ap high court adjourns hearing of tdp chief chandrababu naidu anticipatory bail petition in sand mining case on November 22nd ksp
Author
First Published Nov 8, 2023, 5:54 PM IST

ఇసుక అక్రమాల కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 22 కు వాయిదా వేసింది. ఈ నెల 20 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని ఆదేశించింది ధర్మాసనం. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక స్కాంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబును ఏ2గా చేర్చింది. ఏ 1గా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ3గా చింతమనేని ప్రభాకర్, ఏ 4గా దేవినేని ఉమా వున్నారు. 

కాగా.. తనను రాజకీయ కార్యకలాపాలకు దూరంగా వుంచాలని, న్యాయ విచారణలో తలమునకలై వుండేలా చేయాలనే ఉద్దేశంతోనే ఈ కేసు నమోదు చేశారని ముందస్తు బెయిల్ పిటిషన్‌లో చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీ పాలనలో ఇసుక అక్రమాలు, అవినీతిపై తాను , మిగిలిన విపక్ష నేతలు గళమెత్తుతున్నామని.. తమ నోళ్లు మూయించాలనే ఉద్దేశంతోనే వేధిస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

Follow Us:
Download App:
  • android
  • ios