అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటిలను కార్పొరేషన్ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండింటినీ కలిపి మంగళగిరి- తాడేపల్లి నగరపాలికగా మారుస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి రాజధాని ప్రాంతంలోని మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటిలను కార్పొరేషన్ మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండింటినీ కలిపి మంగళగిరి- తాడేపల్లి నగరపాలికగా మారుస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కార్పోరేషన్ పరిధిలోకి మంగళగిరిలోని 11, తాడేపల్లిలోని 10 పంచాయతీలు విలీనం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, గతంలో ఈ గ్రామ పంచాయతీల విలీనాలను నిరసిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేయడంతో మంగళగిరి, తాడేపల్లి మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే.