Asianet News TeluguAsianet News Telugu

అమ్మఒడిపై క్లారిటీ: ప్రైవేట్ స్కూలైనా, ప్రభుత్వ స్కూలైనా రూ.15 వేలు

వైఎస్ జగన్ ఎన్నికల హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది.

AP Govt Clarity on the Amma Odi scheme
Author
Amaravathi, First Published Jun 23, 2019, 3:01 PM IST

వైఎస్ జగన్ ఎన్నికల హామీలలో ప్రధానమైన నవరత్నాల పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఈ పథకం కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధులకు మాత్రమేనన్న ప్రచారాన్ని ప్రభుత్వం కొట్టేసింది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రెండింట్లో చదువుతున్న విద్యార్ధులకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని.... లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానమని ముఖ్యమంత్రి కార్యాలయం స్ఫష్టం చేసింది.

ఈ మేరకు ఆదివారం ఏపీ సీఎంవో ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకం కింద.. పిల్లలను పాఠశాలకు పంపే ప్రతి తల్లికి ప్రభుత్వం ఏడాదికి రూ. 15 వేలు అందజేస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios