ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. జీవో 145 నిలిపివేత..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. జీవోపై అభ్యంతరాలు రావడంతో దానిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో 145ని నిలిపివేసింది. పట్టణ ప్రాంతాల్లో వేసే లే అవుట్లలో 5శాతం పేదలకు కేటాయించాలని గతంలో ప్రభుత్వం జీవో 145ని జారీ చేసింది. ఆ జీవోపై రియల్ ఎస్టేట్ వ్యాపారుల వినతులు, ఇతరుల నుంచి అభ్యంతరాలు రావడంతో ప్రభుత్వం ఆ జీవోను నిలుపుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది.