చంద్రబాబు కేసు.. ఏఏజీ సుధాకర్ రెడ్డి భద్రత పెంపు.. ఉత్తర్వులు జారీ..
ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

విజయవాడ: ఏపీ ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్(ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డికి భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుధాకర్ రెడ్డికి భద్రత పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 4+4 గన్మెన్లతో ఆయన భద్రత కల్పించనున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఏఏజీ సుధాకర్ రెడ్డి.. స్కిల్ డెవల్ప్మెంట్ కోసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన భద్రత కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది.