Asianet News TeluguAsianet News Telugu

ఏబీవీకి జగన్ షాక్: నిఘా పరికరాల కేసు రీ ఓపెన్ కోరుతూ హైకోర్టులో పిటిషన్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. 

AP government files petition in High court on AB venkateswararao case
Author
Guntur, First Published Apr 19, 2021, 3:12 PM IST

అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై హైకోర్టును ఏపీ ప్రభుత్వం ఆశ్రయించింది. చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న కాలంలో ఏబీ వెంకటేశ్వరరావు  ఇంటలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు.  ఈ సమయంలో  నిఘా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చేశారని  ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు  ఇవ్వాలని ఆయన ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే ఈ పిటిషన్ పై  ఇరువర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు తీర్పును  రిజర్వ్ చేసింది.  

also read:పోలీస్ శాఖపై ఆరోపణలు: ఏబీ వెంకటేశ్వరరావుపై చర్యలకు సిద్ధమైన ఏపీ సర్కార్

ఈ విషయమై తమ వాదనలను వినాలని  ఏపీ సర్కార్ హైకోర్టును కోరింది. కేసును రీ ఓపెన్ చేయాలని కోరింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై  తన వద్ద కీలక సమాచారాన్ని సీబీఐకి ఇచ్చేందుకు ప్రయత్నించినా ఆ శాఖ అధికారులు స్పందించలేదని  ఆయన రెండు రోజుల క్రితం ఆరోపించారు. ఈ విషయమై ఆయన సీబీఐకి లేఖ రాశారు.  సిట్ దర్యాప్తు తీరును, సీబీఐ తీరును  ఆయన తప్పుబట్టారు

Follow Us:
Download App:
  • android
  • ios