Asianet News TeluguAsianet News Telugu

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు : రూ.2,29,779 కోట్లతో బడ్జెట్, హైలైట్స్ ఇవీ..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నాడు  ప్రారంభమయ్యాయి.  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  వర్చువల్ గా ప్రసంగించారు. 

AP finance minister Buggana Rajendranath Reddy introduces budget  for 2021-22 lns
Author
Guntur, First Published May 20, 2021, 10:56 AM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి  గురువారం నాడు ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ. 2,29,779 కోట్లతో 2021-22 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదించాడు. రాష్ట్ర రెవిన్యూ వ్యయం రూ 1,82,196 కోట్లుగా, మూల ధన వ్యయం రూ. 47,582 కోట్లుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది. రెవిన్యూ లోటును రూ. 5 వేల కోట్లుగా తేల్చి చెప్పింది.జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు రూ.3.49 శాతంగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది. 

 

రూ.31,256.36 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రతిపాదించిన మంత్రి కన్నబాబు
వైఎస్ఆర్ జలళక పథకం కోసం రూ. 200 కోట్లు
ఉపాధిహమీ పథకానికి రూ.8,116.16 కోట్లు

వ్యవసాయ మార్కెట్లలో మౌళిక వసతుల కోసం రూ. 100కోట్లు
రైతులకు విత్తనాల సరఫరా కోసం రూ. 100 కోట్లు
ధరల స్థిరీకరణ ఫండ్ కింద రూ. 500 కోట్లు
1,778 రైతు భరోసా కేంద్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చాం
పంట నష్టపోయిన రైతులకు అదే సీజన్ లో పరిహారం చెల్లింపు
నాణ్యమైన యంత్రాల కొనుగోలుకు 40 శాతం రాయితీ
గత ఏడాది రికార్డుస్థాయిలో పంట పరిహారం చెల్లింపు
నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందిస్తున్నాం
రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక చరిత్ర
రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువుల పంపినీ
51.95 లక్షల రైతు కుటుంబాలకు ఆర్ధిక సహాయం

వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకానికి రూ.1802 కోట్లు కేటాయింపు
టీడీపీ ప్రభుత్వం రుణమాఫీకి రూ. 15,279 కోట్లు 
రైతు భరోసా కింద రూ. 3845 కోట్లు కేటాయింపు
వ్యవసాయ పథకాలకు రూ.11,210.80కోట్లు

ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టారు.

ద్రవ్యలోటు రూ. 37వేల కోట్లు
రెవిన్యూ లోటు రూ. 5 వేల కోట్లు
మూలధన వ్యయం రూ.47,582 కోట్లు

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకానికి రూ. 285 కోట్లు

రూ.47,283 కోట్లతో జెండర్ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
రెవిన్యూ లోటు 0.47శాతం
జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.49 శాతం
దిశ కార్యక్రమం కోసం రూ. 33.75 కోట్లు
ఆసుపత్రుల్లో నాడు నేడు పథకానికి రూ.1,535 కోట్లు

మైనార్టీ యాక్షన్ ప్లాన్ కింద రూ.3,840 కోట్లు
లా నేస్తం పథకానికి రూ. 16.64 కోట్లు
రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ. 20 కోట్లు
ల్యాండ్ రీ సర్వే కోసం రూ.206.97 కోట్లు
అంగన్‌వాడీల్లో నాడు నేడు కార్యక్రమానికి రూ.278 కోట్లు

వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, మందుల కొనుగోలుకు రూ..2,248కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్‌ కు రూ. 17,403 కోట్లు

వైఎస్ఆర్ పశువుల నష్టపరిహార పథకానికి రూ. 50 కోట్లు
వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్‌లకు రూ. 88.57 కోట్లు
వైఎస్ఆర్ ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ కోసం రూ.200 కోట్లు
ఏపీఐఐసీకి రూ. 200కోట్లు
పరిశ్రమలకు ఇన్సెంటివ్ ల కోసం రూ. 1000 కోట్లు

శ్రీకాకుళం పలాస ఆసుపత్రికి రూ. 50 కోట్లు
ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో శానిటేషన్ కి రూ. 100కోట్లు
కరోనాపై పోరాటానికి రూ.1000 కోట్లు కేటాయింపు
ఇమామ్, మౌజంలకు ఇన్సెంటివ్‌లకు రూ.80కోట్లు
అర్చకుల ఇన్సెంటివ్ కోసం రూ. 120 కోట్లు
అంగన్‌వాడీల్లో నాడు నేడు కార్యక్రమాలకు రూ.278 కోట్లు
వైఎస్ఆర్ సంపూర్ణ పోషణకు రూ.1,556.39 కోట్లు
వైద్య, ఆరోగ్యశాఖకు రూ.13,830కోట్లు

పురపాలక,పట్టణాభివృద్ది శాఖకు రూ.8,727 కోట్లు
నీటిపారుదల శాఖకు రూ. 13,237కోట్లు
పారిశ్రామిక, మౌళిక సదుపాయాల అభివృద్దికి రూ.3,673.34  కోట్లు
ఎంఎస్ఎంఈల్లో మౌళిక సదుపాయాల కల్పనకు రూ.60.93కోట్లు
రోడ్లు భవనాల శాఖకు రూ.7,594 కోట్లు
ఎనర్జీ రంగానికి రూ. 6,337కోట్లు
ఏపీఐఐసీకి రూ. 200 కోట్లు
కడప స్టీల్ ప్లాంట్‌కు రూ. 250 కోట్లు

ఉన్నత విద్యకు 1,973 కోట్ల కేటాయింపు

మత్స్యకారుల డీజిల్ సబ్సిడీ కోసం రూ. 50 కోట్లు
వ్యవసాయరంగంలో యాంత్రీకరణ కోసం రూ. 739.46 కోట్లు
వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకానికి రూ.1802.82 కోట్లు
అగ్రిగోల్డ్ బాధితుల చెల్లింపులకు రూ. 200 కోట్లు
వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా పథకానికి రూ. 1802 కోట్లు
వైఎస్ఆర్ టెస్టింగ్ ల్యాబ్ లకు రూ. 88.57 కోట్లు
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కోసం రూ. 120 కోట్లు
వైఎస్ఆర్ నేతన్ననేస్తం పథకానికి రూ. 190 కోట్లు
వైఎస్ఆర్ జగనన్న చేదోడు పథకానికి రూ.300 కోట్లు
వైఎస్ఆర్ వాహనమిత్ర పథకానికి రూ.285 కోట్లు
డ్వాక్రా మహిళలకు రూ. 1,112 కోట్లు
కాపు సామాజికవర్గ సంక్షేమం కోసం రూ. 3,306 కోట్లు

హౌసింగ్ , మౌళిక సదుపాయాలకు రూ.5,661 కోట్లు
అమ్మఒడి పథకానికి రూ. 6 వేల 107 కోట్లు
రైతులకు సున్నా వడ్డీ కింద రూ. 500 కోట్లు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు లైవ్: బడ్జెట్ ప్రవేశపెట్టిన బుగ్గన
వైఎస్ఆర్ -పీఎం ఫసల్ భీమా యోజనకు రూ. 1802 కోట్లు
జగనన్న వసతి దీవెనకు రూ. 2,223 కోట్ల కేటాయింపు
పట్టణ ప్రాంతాల్లోని డ్వాక్రా మహిళలకు రూ.247 కోట్లు

వ్యవసాయ పథకాలకు రూ. 11,210 కోట్లు
ఈబీసీ నేస్తం కోసం రూ. 500 కోట్లు కేటాయింపు
వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం రూ. 500 కోట్లు కేటాయింపు
వైఎస్ఆర్ చేయూత కోసం రూ. 4 వేల 455 కోట్లు
వైఎస్ఁఆర్ ఆసరా కోసం రూ. 6వేల337 కోట్లు
వైఎస్ఆర్ పెన్షన్ కానుకకు రూ. 17 వేల కోట్లు
వైద్యం, ఆరోగ్యానికి రూ. 13 వేల830 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్‌కు రూ. 3,840 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్‌ కు రూ. 6,131 కోట్లు

విద్యా పథకాలకు రూ. 24 వేల 624 కోట్లు
వ్యవసాయ పథకాలకు రూ. 11 వేల 210 కోట్లు
పిల్లలకోసం రూ. 16 వేల 748 కోట్లు
మహిళాభివృద్దికి రూ. 47వేల 283 కోట్లు
ఈబీసీ సంక్షేమానికి రూ. 5478 కోట్లు
బీసీలకు 28 వేల 237 కోట్లు కేటాయింపు
బీసీలకు 32 శాతం అధిక కేటాయింపులు

బీసీలకు 32 శాతం అధిక కేటాయింపులు
2021- 22  ఆర్ధిక సంవత్సరానికిఏపీ బడ్జెట్ అంచనా రూ. 2,29,779.27 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించిన ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఏపీ  ఆర్ధిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి

విశాఖ స్టీల్ స్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఎసీ సమావేశంలో తీర్మాణం

బీఎసీ సమావేశం ప్రారంభం కాగానే  ఏపీ అసెంబ్లీ మాజీ శాసనసభ్యుల మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం తెలిపింది. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నాడు  ప్రారంభమయ్యాయి.  ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్  వర్చువల్ గా ప్రసంగించారు. 

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభానికి ముందుగా ఏపీ కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.  బడ్జెట్ ప్రతులను ఏపీ సీఎం జగన్ కు ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అందించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios