ఏపీ ఎంసెట్ ర్యాంకుల్లో తెలంగాణ పిల్లల జోరు: ర్యాంకర్లు వీరే
ఏపీ ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. ఎంసెట్ లో బాలికలపై బాలురు పైచేయి సాధించారు. తెలంగాణ విద్యార్థులు ర్యాంకులు సాధించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్-2020 ఫలితాలు విడుదల అయ్యాయి.విద్యా శాఖ మంత్రి సురేష్ వీటిని అక్టోబర్ 10వ తేదీ ఉదయం విడుదల చేశారు. ఇంజనీరింగ్ ఎంసెట్ కి 1,56,953 మంది, వ్యవసాయ, ఫార్మసీ ఎంసెట్ కి 75,858 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్ ఎంసెట్ లో 1,33,066 మంది వ్యవసాయ,ఫార్మసీ ఎంసెట్ లో 69,616 మంది క్వాలిఫై అయ్యారు.
ఫలితాలు ఎంసెట్ వెబ్ సైట్ లో చూడవచ్చు.ఇంజనీరింగ్ స్ట్రీం లో టాప్ 10 ర్యాంకులలో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ కి చెరో ఐదు ర్యాంకులు వచ్చాయి. వ్యవసాయ, ఫార్మసీ టాప్ పది ర్యాంకులలో తెలంగాణా కి 2 ర్యాంకులు,ఆంధ్రప్రదేశ్ కి 8 ర్యాంకులు వచ్చాయి.కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని మంత్రి సురేష్ తెలిపారు. ఎంసెట్ ఇంజినీరింగ్లో 84.78 శాతం ఉత్తీర్ణులుగా కాగా, మెడిసిన్, అగ్రికల్చర్లో 91.77 శాతం ఉత్తీర్ణులయ్యారు.
ఇంజినీరింగ్లో.....
ఇంజినీరింగ్లో మొదటి ర్యాంకు - వావిలపల్లి సాయినాథ్(విశాఖ)
ఇంజినీరింగ్లో రెండో ర్యాంకు - కుమార్ సత్యం(రంగారెడ్డి)
ఇంజినీరింగ్లో మూడో ర్యాంకు - గంగుల భువన్రెడ్డి(ప్రొద్దుటూరు)
ఇంజినీరింగ్లో నాలుగో ర్యాంకు - ఎం.లిఖిత్రెడ్డి(రంగారెడ్డి)
ఇంజినీరింగ్లో ఐదో ర్యాంకు - సిహెచ్.కౌశల్కుమార్రెడ్డి(సికింద్రాబాద్)
ఇంజినీరింగ్లో ఆరో ర్యాంకు - కె.వి.దత్త శ్రీహర్ష(రాజమహేంద్రవరం)
ఇంజినీరింగ్లో ఏడో ర్యాంకు - వారణాసి సాయితేజ(రంగారెడ్డి)
ఇంజినీరింగ్లో ఎనిమిదో ర్యాంకు - హార్దిక్ రాజ్పాల్(రంగారెడ్డి)
ఇంజినీరింగ్లో తొమ్మిదో ర్యాంకు - కొత్తకోట కృష్ణసాయి(శ్రీకాకుళం)
ఇంజినీరింగ్లో పదో ర్యాంకు - లండ జితేంద్ర(విజయనగరం)
మెడిసిన్, అగ్రికల్చర్లో.....
మెడిసిన్, అగ్రికల్చర్లో మొదటి ర్యాంకు - గుత్తి చైతన్య సింధు(గుంటూరు)
మెడిసిన్, అగ్రికల్చర్లో రెండో ర్యాంకు - త్రిపురనేని లక్ష్మీసాయి మారుతి(గుంటూరు)
మెడిసిన్, అగ్రికల్చర్లో మూడో ర్యాంకు - వి.మనోజ్కుమార్(తిరుపతి)
మెడిసిన్, అగ్రికల్చర్లో నాలుగో ర్యాంకు - దర్శి విష్ణుసాయి(నెల్లూరు)
మెడిసిన్, అగ్రికల్చర్లో ఐదో ర్యాంకు - ఆవుల షుభాంగ్ (రంగారెడ్డి)
మెడిసిన్, అగ్రికల్చర్లో ఆరో ర్యాంకు - సింగిరెడ్డి అవిష్రెడ్డి(మేడ్చల్)
మెడిసిన్, అగ్రికల్చర్లో ఏడో ర్యాంకు - ఎర్రగుడి లిఖిత (కడప)
మెడిసిన్, అగ్రికల్చర్లో ఎనిమిదో ర్యాంకు - జడ వెంకట వినయ్(కడప)
మెడిసిన్, అగ్రికల్చర్లో తొమ్మిదో ర్యాంకు - సోగనూరు నితిన్ వర్మ(కర్నూలు)
మెడిసిన్, అగ్రికల్చర్లో పదో ర్యాంకు - మురికిపూడి రేవంత్(గుంటూరు)