Asianet News TeluguAsianet News Telugu

ముస్లింలకు ఏపీ సీఎం జగన్ ఇఫ్తార్ విందు

ముస్లింలకు  ఏపీ ప్రభుత్వం  ఇవాళ  ఇఫ్తార్ విందు  ఇచ్చింది.  విజయవాడలోని  విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్ విందు ఇచ్చారు.  
 

AP CM YS Jagan  organises  Iftar Party  in Vijayawada  lns
Author
First Published Apr 17, 2023, 9:19 PM IST

విజయవాడ: పవిత్ర రంజాన్  మాసాన్ని  పురస్కరించుకొని  సోమవారంనాడు  ముస్లిం సోదరులకు ఏపీ సీఎం వైఎస్ జగన్  ఇఫ్తార్ విందు  ఇచ్చారు.  విజయవాడ విద్యాధరపురం మిని స్టేడియంలో  ఇఫ్తార్  విందు  ఇచ్చారు సీఎం జగన్.  ఈ సందర్భంగా  ఏపీ సీఎం వైఎస్ జగన్  ప్రసంగించారు. 
ముస్లిం సోదరులకు  ఏపీ సీఎం వైఎస్ జగన్  రంజాన్ శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రాభివృద్ది  కోసం  ప్రతి ఒక్కరూ  ప్రార్ధించాలని ఆయన  ముస్లింలను  కోరారు. మీ ప్రార్ధనలు  సఫలం కావాలన్నారఏపీలో  మైనార్టీలకు  అనేక సంక్షేమ పథకాలు  అందుతున్నాయని  ఏపీ డిప్యూటీ సీఎం  అంజద్ భాషా  చెప్పారు. మైనార్టీలకు  డిప్యూటీ సీఎం పదవిని ఇచ్చిన ఘనత  వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios