ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. ఈ జియో టవర్ల ద్వారా రాష్ట్రంలోని 209 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించనున్నాయి. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,704 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారతదేశం 5జీ దిశగా అడుగులు వేస్తున్న వేళ.. ఇంకా దేశంలో సరైన నెట్వర్క్ లేని ప్రాంతాలు ఎన్నో వున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకేసారి 100 జియో టవర్లను ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్. గురువారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ జియో టవర్ల ద్వారా రాష్ట్రంలోని 209 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందించనున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 85, మన్యం జిల్లాలో 10 , అన్నమయ్య జిల్లాలో 3, కడప జిల్లాలో 2 టవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఈ టవర్ల ద్వారా 4జీ సేవలు అందిస్తుండగా.. భవిష్యత్తులో 5జీ సేవలను అప్గ్రేడ్ చేయాలని రిలయన్స్ నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
సెల్ టవర్స్ ప్రారంభోత్సవం ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ప్రజలు సీఎం ముఖాముఖి నిర్వమించారు. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2,704 ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. దీని కింద 2,363 చోట్ల స్థలాలను జియోకు అప్పగించింది. డిసెంబర్ నాటికి అన్ని ప్రాంతాల్లో టవర్లు ఏర్పాటు చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
