Asianet News TeluguAsianet News Telugu

అమరావతి అసైన్డ్ భూముల కేసు .. హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ , మాజీ మంత్రి నారాయణ కంపెనీల్లో తనిఖీలు

హైదరాబాద్‌లోని మాజీ మంత్రి నారాయణ కంపెనీల్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహిస్తోంది. ఏపీ రాజధాని అమరావతితో చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలుపై సోదాలు జరుగుతున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

ap cid officials searches in ex minister narayana companies in hyderabad
Author
First Published Jan 10, 2023, 4:47 PM IST

హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. మాజీ మంత్రి నారాయణ కంపెనీల్లో తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఎన్ఎస్‌పీఐఆర్ఏ సంస్థలోనూ సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి భారీగా నిధులు మళ్లించినట్లు సీఐడీ అనుమానిస్తోంది. ఈ డబ్బులతో నారాయణ బినామీ పేర్లతో భూములను కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఏపీ రాజధాని అమరావతితో చట్టవిరుద్ధంగా అసైన్డ్ భూముల కొనుగోలుపై సోదాలు జరుగుతున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios