Asianet News TeluguAsianet News Telugu

అమరావతి భూ కుంభకోణం : మాజీ మంత్రి నారాయణకు షాక్.. ఏపీ సీఐడీ నోటీసులు, కుమార్తెలకు కూడా

అమరావతి భూముల కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కుమార్తెలు శరణి, సింధూరకు సీఆర్పీసీ 160 ప్రకారం నోటీసులు ఇచ్చింది. 

ap cid issued notices to ex minister narayana in amaravathi land scam
Author
First Published Feb 28, 2023, 5:43 PM IST | Last Updated Feb 28, 2023, 6:46 PM IST

ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పి.నారాయణకు ఏపీ సీఐడీ షాకిచ్చింది. అమరావతి భూముల కేసులో ఆయనకు మంగళవారం సీఐడీ నోటీసులు ఇచ్చింది. సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇచ్చిన సీఐడీ .. మార్చి 6న తమ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఆయనతో పాటు నారాయణ సంస్థ ఉద్యోగి ప్రమీల, కుమార్తెలు శరణి, సింధూర.. అల్లుళ్లు పునీత్, వరుణ్‌లకు నోటీసులు ఇచ్చింది. వీరంతా మార్చి 7న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios