జూన్ 7న భేటీ కానున్న ఏపీ కేబినెట్.. వివరాలు ఇవే..
ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జూన్ 7వ తేదీన నిర్వహించనున్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశం జూన్ 7వ తేదీన నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. జూన్ 7వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలోని బ్లాక్ 1లో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది.