సుదీర్ఘంగా సాగిన జగన్ తొలి కేబినెట్ భేటీ: కీలక నిర్ణయాలకు ఆమోదం
ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.
అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని తొలి కేబినెట్ భేటీ ఆరు గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ను ఇవ్వాలని నిర్ణయం తీసుకొంది.
ఏపీ మంత్రివర్గ సమావేశం సోమవారం నాడు అమరావతిలో జరిగింది. ఈ సమావేశంలో కీలకమైన అంశాలపై చర్చించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత అదే వేదికపై సామాజిక పెన్షన్లను రూ.2250కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఆశా వర్కర్ల వేతనాలను రూ. 10వేలకు పెంచింది. ఇప్పటికే ఈ విషయమై వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.ఈ హామీని కేబినెట్ ర్యాటిఫికేషన్ చేసింది.
ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ కమిటీ మూడు మాసాల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.
కేబినెట్ ఎజెండా కేవలం 8 అంశాలే ఉన్నాయి. కానీ టేబుల్ ఎజెండాగా 15 అంశాలు చర్చించారని సమాచారం. కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల వేతనాలను రూ. 400 నుండి రూ. 4 వేలకు పెంచుతూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం వల్ల సుమారు 7265 లబ్ది పొందనుంది. సీపీఎస్ రద్దు విషయమై ఏపీ కేబినెట్ సానుకూలంగా స్పందించింది.
పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా కేబినెట్లో చర్చించారు.