Amaravati: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్‌ సమావేశం జ‌రిగింది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ భేటీలో చర్చించింది. అలాగే, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ప‌లు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. 

AP Cabinet Meeting: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన నేడు కేబినెట్‌ సమావేశం జ‌రిగింది. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభ‌మైన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ భేటీలో చర్చించింది. అలాగే, అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన ప‌లు బిల్లులకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. పదవీ విరమణ సమయంలో నిరాశ్రయులైన ఉద్యోగులకు ఇల్లు ఇవ్వాలని పేర్కొంటూ ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగుల పిల్లలను ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పరిధిలోకి తీసుకురావాలని కేబినెట్ నిర్ణ‌యం తీసుకుంది.

జగనన్న సివిల్ సర్వీసెస్ ఇన్సెంటివ్ పేరుతో మరో పథకం ఏర్పాటు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ముసాయిదా బిల్లు, ఏపీ వైద్య విధాన పరిషత్ సవరణ బిల్లు, పేరున్న విశ్వవిద్యాలయాలతో జాయింట్ సర్టిఫికేషన్ కు వీలుగా ప్రైవేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు ఆమోదం, అందులో చదువుతున్న విద్యార్థుల డిగ్రీలను జాయింట్ సర్టిఫికేషన్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కొత్తగా స్థాపించిన ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రపంచంలోని టాప్ 100 విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకునేలా చట్ట సవరణల‌కు నిర్ణ‌యాలు తీసుకుంది.

కురుపాం ఇంజనీరింగ్ కళాశాలల్లో గిరిజనులకు 50 శాతం సీట్లు కేటాయించే ప్రతిపాదన, పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం, అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు పీవోటీ చట్టం సవరణ బిల్లు, భూదాన్, గ్రామదాన్ చట్టం సవరణ బిల్లు, రుణ చట్ట సవరణ బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.