Asianet News TeluguAsianet News Telugu

పోలవరంలో ప్రతీ సోమవారం చంద్రబాబు క్యాట్ వాక్ షో:కన్నా

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పోలవరం నిర్మాణానికి బీజేపీ కంకణం కట్టుకుందని తెలిపారు. సబ్‌ కాంట్రాక్టుల్లో కమీషన్లు, దళిత, గిరిజనుల భూముల పేరుతో టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. 

Ap bjp president kanna laxminarayana slams chandrababu
Author
Guntur, First Published Oct 16, 2018, 5:26 PM IST

గుంటూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా పోలవరం నిర్మాణానికి బీజేపీ కంకణం కట్టుకుందని తెలిపారు. సబ్‌ కాంట్రాక్టుల్లో కమీషన్లు, దళిత, గిరిజనుల భూముల పేరుతో టీడీపీ దోచుకుంటుందని ఆరోపించారు. పోలవరం పేరుతో ప్రతి సోమవారం చంద్రబాబు క్యాట్‌వాక్‌లు చేస్తున్నారని కన్నా ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇస్తున్న నిధులన్నీ టీడీపీ స్వాహా చేస్తోందని...జన్మభూమి కమిటీ మెుదలు చంద్రబాబు వరకు దోచుకుంటున్నారని విమర్శించారు. రాజధానికి రైతులిచ్చిన భూములతో చంద్రబాబు, లోకేష్‌లు వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. 2014లో ఏ కాంగ్రెస్‌ పార్టీని బాబు తిట్టాడో 2019లో అదే కాంగ్రెస్‌ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలను తిప్పికొడతామని వ్యాఖ్యానించారు.

Follow Us:
Download App:
  • android
  • ios