ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం అర్హత సాధించారు. 

అమరావతి : ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వీటిని విడుదల చేశారు. పాలిసెట్ ప్రవేశ పరీక్షకు 1,38,189మంది దరఖాస్తు చేయగా, 1,31,627మంది హాజరయ్యారు. ఫలితాల్లో 91.84శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 90.56శాతం బాలురు.. 93.9శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు వందశాతం అర్హత సాధించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred