తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టులో ఏపీ రైతుల పిటిషన్...
తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 28వ తేదీన జీవో నెంబర్ 34 విడుదల చేసిన ప్రభుత్వం జీవో మీద రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేశారు.
తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 28వ తేదీన జీవో నెంబర్ 34 విడుదల చేసిన ప్రభుత్వం జీవో మీద రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేశారు.
ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 34 తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందంటూ పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. సాగునీటికి ఉపయోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అలా చేయడం ద్వారా నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతుందని పిటిషనర్లు తెలిపారు.