Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో 120 కొత్త కేసులు: ఏపీలో మొత్తం 8,91,004కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో120 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 91వేల 004 కి చేరుకొన్నాయి. 
 

andhra pradesh reports 120 new corona cases, total rises to 8,91,004 lns
Author
Guntur, First Published Mar 10, 2021, 5:50 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో120 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 91వేల 004 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు  మరణించారు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,177 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,43,56,138 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 48,973 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో120 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 093 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 82వేల 763 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1064 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 004, చిత్తూరులో 015,తూర్పుగోదావరిలో 005 గుంటూరులో 006, కడపలో 010, కృష్ణాలో 025, కర్నూల్ లో 002, నెల్లూరులో 009, ప్రకాశంలో 002 శ్రీకాకుళంలో 003, విశాఖపట్టణంలో 017, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 000 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,823, మరణాలు 600
చిత్తూరు  -87,795,మరణాలు 854
తూర్పుగోదావరి -1,24,531, మరణాలు 636
గుంటూరు  -75,818, మరణాలు 672
కడప  -55,438, మరణాలు 463
కృష్ణా  -49,056,మరణాలు 681
కర్నూల్  -60,935, మరణాలు 489
నెల్లూరు -62,522, మరణాలు 508
ప్రకాశం -62,222, మరణాలు 580
శ్రీకాకుళం -46,272,మరణాలు 347
విశాఖపట్టణం  -60,159, మరణాలు 567
విజయనగరం  -41,172, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,366, మరణాలు 542

 

Follow Us:
Download App:
  • android
  • ios