Asianet News TeluguAsianet News Telugu

24 గంటల్లో కృష్ణాలో అత్యధికం, కర్నూల్‌లో అత్యల్పం: ఏపీలో మొత్తం 8,62,213 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1121  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 62వేల 213 కి చేరుకొన్నాయి. 
 

andhra pradesh reports 1121 new corona cases, total rises to 8,62,213 lns
Author
Amaravathi, First Published Nov 22, 2020, 6:11 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 1121  కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 62వేల 213 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో 11 మంది కరోనా మరణించారు. కరోనాతో చిత్తూరు, కృష్ణాలో ఇద్దరేసిమరణించారు.అనంతపురం,తూర్పుగోదావరి,గుంటూరు,కడప,విశాఖపట్టణం,విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు. దీంతోమరణించినవారి సంఖ్య 6,938కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 96లక్షల 15వేల 090 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.  గత 24 గంటల్లో 71,913 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 1121మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో1631 మంది కరోనా నుండి కోలుకొన్నారు.

ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 41వేల 026 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 14,249  యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 046,చిత్తూరులో 130,తూర్పుగోదావరిలో 134, గుంటూరులో 164, కడపలో 060 కృష్ణాలో 167, కర్నూల్ లో 021, నెల్లూరులో 026, ప్రకాశంలో 064, శ్రీకాకుళంలో 067, విశాఖపట్టణంలో 077, విజయనగరంలో 023,పశ్చిమగోదావరిలో 142కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -66,474, మరణాలు 586
చిత్తూరు  -83,094,మరణాలు 822
తూర్పుగోదావరి -1,21,624, మరణాలు 632
గుంటూరు  -72,061, మరణాలు 644
కడప  -54,046,మరణాలు 448
కృష్ణా  -44,477, మరణాలు 622
కర్నూల్  -60,075, మరణాలు 484
నెల్లూరు -61,141, మరణాలు 493
ప్రకాశం -61,265, మరణాలు 577
శ్రీకాకుళం -45,307 మరణాలు 346
విశాఖపట్టణం  -57,706, మరణాలు 532
విజయనగరం  -40,473,మరణాలు 234
పశ్చిమగోదావరి -91,575, మరణాలు 518

 

 

Follow Us:
Download App:
  • android
  • ios