Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో భారీగా తగ్గుతున్న కరోనా కేసులు: మొత్తం 8,87,900కి చేరిక

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 064 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 87వేల 900 కి చేరుకొన్నాయి. 

Andhra pradesh reports 064 new corona cases, total rises to 8,87,900 lns
Author
Guntur, First Published Feb 1, 2021, 6:01 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 064 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 8 లక్షల 87వేల 900 కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో ఒక్కరు మరణించారు. కృష్ణా జిల్లాలో కరోనాతో ఓ వ్యక్తి చనిపోయాడు. రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,154కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,31,59,794 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 21,922 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో064 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. 

గత 24 గంటల్లో 099 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 79వేల 504 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 1242 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 004, చిత్తూరులో 004,తూర్పుగోదావరిలో 015, గుంటూరులో 007, కడపలో 004, కృష్ణాలో 009, కర్నూల్ లో 002, నెల్లూరులో 008, ప్రకాశంలో 000, శ్రీకాకుళంలో 001, విశాఖపట్టణంలో 010, విజయనగరంలో 000,పశ్చిమగోదావరిలో 000 కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -67,648, మరణాలు 599
చిత్తూరు  -87,039,మరణాలు 847
తూర్పుగోదావరి -1,24,275, మరణాలు 636
గుంటూరు  -75,511, మరణాలు 670
కడప  -55,268, మరణాలు 463
కృష్ణా  -48,670,మరణాలు 677
కర్నూల్  -60,818, మరణాలు 488
నెల్లూరు -62,333, మరణాలు 506
ప్రకాశం -62,175, మరణాలు 580
శ్రీకాకుళం -46,126, మరణాలు 347
విశాఖపట్టణం  -59,773, మరణాలు 561
విజయనగరం  -41,133, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,236, మరణాలు 542

 


 

Follow Us:
Download App:
  • android
  • ios