ఉపాధ్యాయ సంఘాలు తలపెట్టిన తాడెపల్లి గూడెం సీఎం క్యాంప్ ఆఫీసు ముట్టడిని భగ్నం చేసేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం తాడెపల్లి గూడెం ప్రాంతమంతా పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. ఎటు వైపు నుంచీ నిరసనకారులు అడుగుపెట్టకుండా పోలీసుటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
సీపీఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ యూటీఎఫ్ నేడు తాడేపల్లి క్యాంప్ ఆఫీసును ముట్టడించాలని పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో దీనిని నిర్వీర్యం చేసేందుకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. దీని కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు గుంటూరు జిల్లా తాడేపల్లి గూడెంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని మొత్తం పోలీసులు బలగాలు దిగ్బంధం చేశాయి. గట్టి బందోస్తును ఏర్పాటు చేశాయి.
తాడెపల్లి గూడెం క్యాంప్ ఆఫీసుకు ఎవరూ అడుగుపెట్టకుండా పోలీసులు మొత్తం 5 అంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 52 చోట్ల చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని నిలువరిచేందుకు 1000 మంది పోలీసులను ఉపయోగిస్తున్నారు. గుంటూరు జిల్లాలోని పోలీసులతో పాటు ఇతర జిల్లా పోలీసులను తాడెపల్లిగూడెంకు రప్పించుకున్నారు. సివిల్,ఏఆర్, ఆక్టోపస్ వంటి ప్రత్యేక బలగాలకు అక్కడ విధులు కేటాయించారు.
ఈ ముట్టడిని భగ్నం చేసేందుకు ఆదివారం నాటి నుంచే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మఫ్టీలో తిరుగుతూ వాహనాలు చెక్ చేస్తూ అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ముందుగానే నిరసనకారులను, ఆందోళన వ్యక్తం చేసే అవకాశం ఉన్న వారిని గుర్తించి సమీపంలోని పోలీసు స్టేషన్ లకు తీసుకెళ్లాని నిర్ణయించుకున్నారు. పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసుకోవాలని ప్లాన్ చేశారు.
యూటీఎఫ్ పిలుపు నేపథ్యంలో దాదాపు ఆదివారం ఉదయం నుంచే పోలీసులు అలెర్ట్ గా ఉన్నారు. ఈ ముట్టడిని ఎలాగైనా సక్సెస్ చేయాలనే గట్టి ఆలోచనతో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రణాళికలు రచించుకున్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ భద్రతతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాల్లో యాక్టివ్ గా ఉండే నాయకులు పోలీసులు ముందుగానే గుర్తించి వారికి నోటీసులు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఆదేశించారు.