ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. బాలికపై వేధింపులకు పాల్పడినందుకు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఓ వాలంటీర్ భర్తపై కేసు నమోదైంది. బాలికపై వేధింపులకు పాల్పడినందుకు ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంటర్ చదువుతున్న తమ కూతురు స్నానం చేస్తుండగా వాలంటీర్ భర్త వీడియోలు తీసి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే బాలిక తల్లిదండ్రులు తిరువూరు పోలీసులను ఆశ్రయించారు.
బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తనను వేధించిన వాలంటీర్ భర్తకు కఠిన శిక్ష విధించాలని భాదితురాలు డిమాండ్ చేస్తుంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి కొందరు రాజీ ప్రయత్నాలు చేసినట్టుగా తెలిసింది. అయితే బాలిక తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిపై వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక, ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో ఓ వాలంటీర్ బాలికపై అత్యాచారం చేశాడు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బిలి లంకకు చెందిన గ్రామ వాళ్లంటే బూసి సతీష్ (23) అదే గ్రామానికి చెందిన బాలికపై అత్యాచారం చేశాడు. గ్రామ పని చేస్తూ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో ఓ minor girlతో పరిచయం పెంచుకున్న యువకుడు ఆ తర్వాత ఎవరూ లేని సమయంలో ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఆ తరువాత ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని బెదిరించాడు. ఆదివారం బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు సతీష్ పై పోక్సో కింద కేసు నమోదు చేశారు.
