ఎల్లుండి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. 

ఎల్లుండి జరగాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. తొలుత ఈ నెల 22న కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముహుర్తం ఖరారు చేశారు. అయితే తాజాగా కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24వ తేదీ ఉదయం 11 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. దావోస్ పర్యటనలో కూదుర్చుకున్న ఎంవోయూలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ఇళ్ల నిర్మాణ పురోగతి, ఇరిగేషన్ ప్రాజెక్టులు.. తదితర అంశాలు కూడా ఈ బేటీలో చర్చకు రానున్నట్టుగా తెలుస్తోంది.