Asianet News TeluguAsianet News Telugu

మున్సిపాలిటీల్లో చెత్త సేకరణ: ఈ ఆటోలు పంపిణీ చేసిన జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో  చెత్త సేకరణకు గాను   ఈ ఆటోలను  ఏపీ సీఎం గురువారంనాడు ప్రారంభించారు.

 Anadhra Pradesh CM Jagan Mohan Reddy launches distribution of 516 e-autos
Author
First Published Jun 8, 2023, 11:02 AM IST

అమరావతి:  మున్సిపాలిటీల్లో  చెత్త  సేకరణకు అవసరమైన ఈ ఆటోలను  గురువారంనాడు  ఏపీ సీఎం వైఎస్ జగన్  జెండా ఊపి  ప్రారంభించారు.జగనన్న  స్వచ్ఛ  సంకల్పం  కింద  36 మున్సిపాలిటీలకు  ఈ ఆటోలను  పంపిణీ చేశారు సీఎం జగన్.  36 మున్సిపాలిటీలకు  516 ఆటోలను  అందించింది ప్రభుత్వం . ఈ ఆటోలను  తాడేపల్లిలో  సీఎం  జగన్ జెండా ఊపి ప్రారంభించారు. 

జగనన్న  స్వచ్ఛ  సంకల్పం  కింద 123 మున్సిపాలిటీల్లో   తడి, పొడి చెత్త బుట్టలను  ప్రభుత్వం పంపిణీ చేసింది.  రూ. 72 కోట్లతో  40 లక్షలకు పైగా  కుటుంబాలకు  బుట్టలను పంపిణీ  చేశారు.గ్రేడ్  1 , ఆపై మున్సిపాలిటీల్లో  చెత్త సేకరణకు 2500 పెట్రోల్, డీజీల్, సీఎన్ జీ వాహనాలను  ఉపయోగిస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios