ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో చెత్త సేకరణకు గాను ఈ ఆటోలను ఏపీ సీఎం గురువారంనాడు ప్రారంభించారు.
అమరావతి: మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు అవసరమైన ఈ ఆటోలను గురువారంనాడు ఏపీ సీఎం వైఎస్ జగన్ జెండా ఊపి ప్రారంభించారు.జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 36 మున్సిపాలిటీలకు ఈ ఆటోలను పంపిణీ చేశారు సీఎం జగన్. 36 మున్సిపాలిటీలకు 516 ఆటోలను అందించింది ప్రభుత్వం . ఈ ఆటోలను తాడేపల్లిలో సీఎం జగన్ జెండా ఊపి ప్రారంభించారు.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద 123 మున్సిపాలిటీల్లో తడి, పొడి చెత్త బుట్టలను ప్రభుత్వం పంపిణీ చేసింది. రూ. 72 కోట్లతో 40 లక్షలకు పైగా కుటుంబాలకు బుట్టలను పంపిణీ చేశారు.గ్రేడ్ 1 , ఆపై మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు 2500 పెట్రోల్, డీజీల్, సీఎన్ జీ వాహనాలను ఉపయోగిస్తున్నారు.
