Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి తర్వాత తొలిసారిగా అఖిలప్రియ దంపతులు..ఏంచేశారంటే

మంత్రి అఖిలప్రియ వివాహం ఇటీవల భార్గవ్ తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు తొలిసారిగా కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

akhila priya visits rudraram with husband bhargav
Author
Hyderabad, First Published Sep 12, 2018, 12:39 PM IST

ఏపీ పర్యాటశాఖ మంత్రి అఖిలప్రియ వివాహం ఇటీవల భార్గవ్ తో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. వివాహం అనంతరం ఈ నూతన దంపతులు తొలిసారిగా కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

akhila priya visits rudraram with husband bhargav

మంత్రి అఖిలప్రియ దంపతులు వరినాట్లు వేశారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని రుద్రవరం గ్రామ సమీపంలోని పాములేటి అనే రైతు పొలంలో మంత్రి, ఆమె భర్త భార్గవ్ రామ్ నాయుడు వరినాట్లు వేశారు. ఈ సందర్భంగా కూలీలతో వారు మాటామంతీ కలిపి వ్యవసాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు ఎంత కూలీ ఇస్తున్నారు? అని ఆరా తీశారు. కొత్త దంపతులు ఇలా తమతో కలిసి పనిచేయడంతో కూలీలు సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios