ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీకి పొడిగించింది ఏసీబీ కోర్టు.
అమరావతి: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడు రిమాండ్ ను ఈ నెల 24వ తేదీకి పొడిగించింది కోర్టు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఈ నెల 9వ తేదీన టీడీపీ చీఫ్ చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది.ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్ పూర్తి కానుంది. దీంతో చంద్రబాబును వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపర్చారు సీఐడీ అధికారులు. వర్చువల్ గా కోర్టు విచారణకు హాజరైన టీడీపీ చీఫ్ చంద్రబాబును జడ్జి విచారించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

