మైనర్ బాలిక మెడలో తాళి కట్టిన యువకుడు.. వీడియో వైరల్..
పదిహేనేళ్ల మైనర్ బాలిక మెడలో ఓ యువకుడు తాళి కట్టాడు. ఇప్పుడా విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో వైరల్ అయ్యింది.
అనంతపురం జిల్లా : మైనర్లను వివాహం చేసుకోవడం, వారితో శారీరక సంబంధం పెట్టుకోవడం చట్టరీత్యా నేరం. పోక్సో చట్టం కింద శిక్షలు పడే అవకాశం ఉంటుంది. అయితే దీనిని కాదని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ఓ మైనర్ కు ఓ యువకుడు బహిరంగంగా తాళికట్టాడు. దీనికి ఇరు కుటుంబాలు వత్తాసు పలికాయి. అనంతపురం జిల్లా అమిత్యాలలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. అమిత్యాల గ్రామానికి చెందిన 15 ఏళ్ల హేమలత అనంతపురంజిల్లాలోని గవర్నమెంట్ స్కూల్లో 8వ తరగతి చదువుతోంది.
అదే గ్రామానికి చెందిన 23 ఏళ్ల శ్రీకాంత్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం హేమలత మెడలో తాళి కట్టాడు. ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పి, మెడలో పసుపు కొమ్ము కట్టేశాడు. హేమలత తల్లి ఆదిలక్ష్మి, తండ్రి రామప్ప. వీరికి నాలుగో కుమార్తె ఆమె. ఇటీవల అనారోగ్యం కారణంగా తండ్రి రామప్ప చనిపోయాడు. తల్లి వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. శ్రీకాంత్ తండ్రి కూడా కొంతకాలం క్రితమే చనిపోయాడు. తల్లి ఉమాదేవి. ఆమె వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది.
జీవో నెంబర్ 1:విచారణ ఈ నెల 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
అయితే హేమలత, శ్రీకాంతుల మధ్య గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తోందని స్థానికులు చెబుతున్నట్టు సమాచారం. ఎవరికి తెలియకుండా వీరు కలిసి తిరుగుతున్నారు. ఈ విషయం ఆ నోట ఈ నోట కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వీరిద్దరి ప్రేమకు వారు అడ్డు చెప్పారు. అంతేకాదు పెళ్లి చేసుకున్న తర్వాతే అమ్మాయితో తిరగాలని కండిషన్ పెట్టారు. దీంతో శ్రీకాంత్ ఆ బాలిక ఇంటికి వెళ్ళాడు. అందరూ చూస్తుండగానే పబ్లిక్ గా ఆమె మెడలో పసుపు తాడు కట్టేశాడు.
ఇలా చేస్తున్న సమయంలో ఆ బాలిక ప్రతిఘటించలేదు. కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో తాళి కట్టేసావు కదా ఇక ఏమైనా చేసుకో, పబ్లిక్ గా తిరిగినా మాకేమి అభ్యంతరం లేదు.. అనే మాటలు పక్కనుండి వినిపిస్తున్నాయి. దీంతో మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న విషయం సంచలనంగా మారింది.