తిరుపతి జిల్లా గూడూరులో కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. 

తిరుపతి జిల్లా గూడూరులో కారు బీభత్సం సృష్టించింది. కొంతమంది యువకులు కారును జనాల మీదకు నడిపారు. ఈ ప్రమాదంలో ఆరు బైకులు ధ్వంసం కాగా.. ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్ధితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. కారులో వున్న వారు మద్యం మత్తులో వున్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే వారిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.