Asianet News TeluguAsianet News Telugu

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.

6 killed in road accident in annamayya district ksp
Author
First Published Jul 22, 2023, 7:23 PM IST

అన్నమయ్య జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. సాయంత్రం కడప నుంచి తిరుపతికి వెళ్లున్న ఆర్టీసీ బస్సు ఓరంపాడు వద్ద ఎదురుగా వస్తున్న ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా.. మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ప్రమాదం కారణంగా రాజంపేట - తిరుపతి మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. గాయపడినవారిలో పలువురి పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రముఖ తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios