Asianet News TeluguAsianet News Telugu

ప్రకాశం జిల్లా : లారీ ఢీ , కారులో మంటలు.. ముగ్గురి సజీవ దహనం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెంలో కారును లారీ ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో కారులో వున్న ముగ్గురు సజీవ దహనమయ్యారు. 

3 killed in car catches fire in prakasam district
Author
Markapur, First Published May 17, 2022, 7:04 PM IST

ప్రకాశం జిల్లాలో (prakasam district) దారుణం జరిగింది. కారులో మంటలు (fire accident) చెలరేగి ముగ్గురు సజీవ దహనమయ్యారు. కారును లారీ ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. మార్కాపురం (markapur) మండలం తిప్పాయపాలెంలో ఈ ఘటన జరిగింది. దీంతో భయపడిన లారీ డ్రైవర్, క్లీనర్ ఘటనాస్థలంలోనే లారీని వదిలి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన  మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios