Asianet News TeluguAsianet News Telugu

స్కూటీపై నుంచి జారీ పడ్డ చిన్నారి.. బిడ్డ కోసం దూకేసిన తల్లి, దూసుకొచ్చిన లారీ

పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందాడు. తేజ స్కూటీ నుంచి జారీ కిందపడ్డాడు. బిడ్డ కోసం తల్లి యశోద కూడా స్కూటీ పైనుంచి దూకేసింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో బాలుడు తేజ అక్కడికక్కడే మృతిచెందాడు

2 years child died in road accident in palnadu district
Author
First Published Sep 23, 2022, 5:37 PM IST

పల్నాడు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగురాళ్ల నుంచి దామరచర్ల నుంచి వెళ్తున్న కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. భార్యాభర్తలు ఇద్దరు చిన్నారులతో కలిసి స్కూటీపై వెళ్తున్నారు. అయితే రెండేళ్ల చిన్నారి తేజ స్కూటీ నుంచి జారీ కిందపడ్డాడు. బిడ్డ కోసం తల్లి యశోద కూడా స్కూటీ పైనుంచి దూకేసింది. ఇదే సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో బాలుడు తేజ అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి యశోదకు తీవ్ర గాయాలయ్యాయి. అద్దంకి - నార్కెట్‌పల్లి జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios