ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 114 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కి చేరింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. గడిచిన 24 గంటల్లో 114 మందికి కోవిడ్ నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,85,824కి చేరింది.
నిన్న కరోనా కారణంగా ఏ ఒక్కరూ చనిపోలేదని ప్రభుత్వం వెల్లడించింది. నిన్నటి వరకు మొత్తం కోవిడ్ మరణాల సంఖ్య 7,139గా వుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,987 యాక్టీవ్ కేసులున్నాయి.
గత 24 గంటల్లో 326 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో డిశ్చార్జ్ల సంఖ్య 8,76,698కి చేరింది. నిన్న 25,542 మందికి కోవిడ్ నిర్థారణా పరీక్షలు చేయడంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,25,40,181కి చేరుకుంది.
గత 24 గంటల్లో అనంతపురం 3, చిత్తూరు 24, తూర్పు గోదావరి 13, గుంటూరు 6, కడప 2, కృష్ణా 12, కర్నూలు 8, నెల్లూరు 10, ప్రకాశం 1, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 22, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 4 కేసులు నమోదయ్యాయి.
#COVIDUpdates: 16/01/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 16, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,82,929 పాజిటివ్ కేసు లకు గాను
*8,73,803 మంది డిశ్చార్జ్ కాగా
*7,139 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,987#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/i9vGHjW9u6
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 16, 2021, 6:06 PM IST