video: గాంధీగారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారు : సుజనాచౌదరి

Oct 17, 2019, 7:00 PM IST

గాంధీజీ సంకల్పయాత్రలో భాగంగా గురువారం ఉదయం కృష్ణాజిల్లా నూజివీడు లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి నాయకత్వంలో పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి గాంధీజీ సంకల్ప పాదయాత్ర ప్రారంభమైంది. జంక్షన్ రోడ్డులోని యస్ కన్వెన్షన్ హాలులో నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సుజనాచౌదరి మాట్లాడుతూ గాంధీ గారి ఆశయాలను ప్రజలు మర్చిపోతున్నారని అందుకే ప్రధాని నరేంద్రమోడీ ఆదేశాలమేరకు గాంధీజీ సంకల్ప యాత్ర మొదలపెట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ ఇంచార్జి చిన్నం రామకోటయ్య, జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు