video news : పున్నమిఘాట్ లో మతమార్పిడులు జరుగుతుంటే జగన్ ఏం చేస్తున్నాడు....

Dec 4, 2019, 5:12 PM IST

కృష్ణానది ఒడ్డునున్న పున్నమి ఘాట్ లో మతమార్పిడులు జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. సోమవారం ఒక్కరోజే 42మందికి మతమార్పిడిలు చేశారని ఆరోపించారు. గతవారం రోజులుగా వందమందికి పైగా మతమార్పిడి చేశారని, జగన్ ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో జరుగుతున్న ఈ తంతు జగన్ కు తెలియదా అని ప్రశ్నించాడు. ఒక మతానికి చెందిన పుణ్యస్థలంలో వేరేమతం వారు మతమార్పిడి చేస్తుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోందని అడిగారు.