పూర్ణాహుతి తో ముగిసిన అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు

Jul 5, 2020, 3:19 PM IST

కోవిడ్ నిబంధనలు అనుసరించి శాకాంబరీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాం .ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు అమ్మవారు శాకాంబరీ దేవిగా దర్శనం ఉంటుంది.తెలంగాణ నుండి అమ్మవారికి బోనాలు మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు సమర్పించనున్నారు. శాకాంబరీ ఉత్సవాల కి నిన్నటి వరకు 9500 మంది భక్తులు దర్శించుకున్నారు.ఈ రోజు 8000 వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం.అమ్మవారికి  మూడు రోజుల పాటు 30 టన్నుల కూరగాయలు పండ్లు తో అలంకరణ చేసాం అని దుర్గ గుడి చైర్మన్ పైలా సోమినాయుడు అన్నారు.