కలెక్టర్ కృష్ణభాస్కర్ పై గల్లీ లీడర్ వీరంగం...

Mar 24, 2020, 10:43 AM IST

కరోనాతో సిరిసిల్లలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ వాహనాలు రోడ్డమీదికి రావడంపై జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ సోమవారం స్వయంగా కలెక్టరేట్ సమీపంలోని ప్రధాన రహదారిపై వాహనాలను ఆపుతూ మరోసారి రావద్దని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బద్దెనపల్లికి చెందిన గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్ నేను లీడర్ ను, నా వాహనం ఆపుతావా అంటూ కలెక్టర్ తో దురుసుగా ప్రవర్తించాడు. వెంటనే పోలీసు అధికారులను కేసు నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. దీంతో సీఐ వెంకటనర్సయ్య వెంటనే అతడిని అదుపులోకి తీసుకొని అతనిపై కేసు నమోదు చేశారు.