తల్లి కావాలనే పద్నాలుగేళ్ల కల నెరవేరేలోపే.. మృత్యువు కాటేసింది..

Jun 5, 2020, 10:11 AM IST

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేగొండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జూపాక కనుకయ్య స్వరూపలకు పెళ్లై పద్నాలుగు సంవత్సరాలైన సంతానం లేదు. దీంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో IVF ద్వారా గర్భం దాల్చింది. కవలపిల్లలని చెప్పడంతో ఆ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అయితే ఎనిమిదో నెలలో హఠాత్తుగా వచ్చిన గుండెపోటు స్వరూపతో పాటు, కడుపులోని ఇద్దరు పిల్లల్నీ బలి తీసుకుంది. దీంతో ఇరుకుటుంబాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.