Praja Sangrama Yatra‌-3 : దుర్గమ్మను దర్శించుకుని యాదాద్రి బయలుదేరిన బండి సంజయ్

Aug 2, 2022, 11:30 AM IST

హైదరాబాద్ :  తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ఇవాళ్టి (మంగళవారం) నుండి ప్రారంభంకానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధి నుండి బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో యాదగిరిగుట్టకు బయలుదేరేముందు హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొబ్బరి కాయ కొట్టి, అమ్మవారికి హారతి పడుతూ సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాంపల్లిలోని బిజెపి కార్యాలయానికి చేరుకుని శ్యామప్రసాద్ ముఖర్జీ చిత్ర పటానికి నివాళులు అర్పించారు. ఆ తర్వాత యాదగిరిగుట్టకు బయలుదేరారు బండి సంజయ్.