లాక్ డౌన్ ఎఫెక్ట్ : పేకాట స్థావరాలపై పోలీసుల దాడి.. ఆరుగురు అరెస్ట్

May 5, 2020, 1:04 PM IST

మంచిర్యాల  జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్ లోని ఒక ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న వారిపై అర్ధరాత్రి సమయంలో రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. వారినుండి 19,020 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  ఆరుగురు జూదరులను అరెస్ట్ చేసినట్టు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ వి. సత్యనారాయణ  తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించే చర్యలకు పాల్పడే వారిని విడిచి పెట్టేది లేదని, వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.