వేయిస్తంభాల గుడిలో పూజలు చేసిన మంత్రులు

Feb 21, 2020, 12:10 PM IST

మహా శివరాత్రి సందర్భంగా వేయిస్తంభాల దేవాలయంలో రుద్రేశ్వర స్వామికీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ లు పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సేవ చేసే శక్తి 
ఇవ్వమని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలకు చాలా నిధులు ఇచ్చి సీఎం కేసీఆర్ గారు దేవాలయాలను అభివృద్ధి  చేస్తున్నారు. జాతీయ సంపద అయిన ఈ దేవాలయాన్ని కాపాడుకునేందుకు మా వంతు కృషి చేస్తాం అన్నారు.