జాతీయ కబడ్డీ పోటీలో అపశ్రుతి, గ్యాలరీ కుప్పకూలి 50 మందికి గాయాలు

Mar 22, 2021, 7:42 PM IST

సూర్యాపేటలో నిర్వహిస్తున్న సావిత్రమ్మ స్మారక జాతీయ కబడ్డీ పోటీలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఒక్కసారిగా గ్యాలరీ కుప్పకూలడంతో దాదాపుగా 50 మంది గాయాలపాలయ్యారు. ఇనుప చువ్వలకింద ఇరుక్కున్న వారిని సహాయక సిబ్బంది బయటకు తీస్తున్నారు. మంత్రి గుంతకండ్ల జగదీశ్ రెడ్డి  తల్లి సావిత్రమ్మ పేరుమీద ఈ స్మారక టోర్నీని నిర్వహిస్తున్నారు.